ఆర్సీబీకి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ కు డివిలియర్స్ దూరం..?

| Edited By:

Jul 27, 2020 | 1:25 PM

యూఏఈలో జరిగే ఐపీఎల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబరు 19నుండి నవంబర్ 8 వరకు ఐపీఎల్-2020 జరుగనుంది. అయితే.. కరోనా వైర్‌స్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. దీంతో గత కొన్ని

ఆర్సీబీకి ఎదురుదెబ్బ.. ఐపీఎల్ కు డివిలియర్స్ దూరం..?
Follow us on

యూఏఈలో జరిగే ఐపీఎల్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబరు 19 నుండి నవంబర్ 8 వరకు ఐపీఎల్-2020 జరుగనుంది. అయితే.. కరోనా వైర్‌స్ నేపథ్యంలో సౌతాఫ్రికాలో కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఆ దేశానికి అంతర్జాతీయ విమాన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా క్రికెటర్లు పాల్గొనడం అనుమానంగా మారింది. స్టార్‌ ఆటగాళ్లు డివిలియర్స్, డికాక్‌ సహా మొత్తం 10 మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

కాగా.. టోర్నీ ఆరంభంలోనే ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ తరపున ఆడనున్న స్టార్ బ్యాట్స్ మన్ డివిలియర్స్ దూరం కానున్నాడు. ఐపీఎల్ నాటికి విమాన సర్వీసులు ప్రారంభం కాకపోతే సౌతాఫ్రికా ఆటగాళ్లు టోర్నీలో పాల్గొనడం కష్టమేననే అభిప్రాయం వినిపిస్తోంది. ఐపీఎల్‌కు తాము ఆతిథ్యమిస్తామంటూ ఎమిరేట్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) చేసిన ప్రతిపాదనకు బీసీసీఐ అంగీకారం తెలిపిందని బోర్డు అధ్యక్షుడు బ్రిజేష్‌ పటేల్‌ తెలిపారు.

Read More: 

గుడ్ న్యూస్: సప్లిమెంటరీ, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులకు పాస్‌ మార్కులు..

గుడ్ న్యూస్: ఇక కామర్స్‌, ఆర్ట్స్‌ విద్యార్థులకూ ‘గేట్‌’ రాసే అవకాశం..!