అత్తింటి వేధింపులు.. 9వ అంతస్తు నుంచి దూకి మహిళా టెకీ ఆత్మహత్య

| Edited By:

Apr 06, 2019 | 2:21 PM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. అత్తమామల వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. 9వ అంతస్తు నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వినయ్ కుమార్- మేఘనా దంపతులు నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి వివాహం కాగా.. పెళ్లైన ఆరు నెలల నుంచే అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో అత్తింటి నుంచి వచ్చేసిన మేఘనా.. కొన్నిరోజులుగా మైత్రినగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్ద […]

అత్తింటి వేధింపులు.. 9వ అంతస్తు నుంచి దూకి మహిళా టెకీ ఆత్మహత్య
Follow us on

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. అత్తమామల వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. 9వ అంతస్తు నుంచి దూకి ఆమె ప్రాణాలు తీసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్‌పల్లి హైదర్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో వినయ్ కుమార్- మేఘనా దంపతులు నివసిస్తున్నారు. రెండేళ్ల క్రితమే వీరిద్దరికి వివాహం కాగా.. పెళ్లైన ఆరు నెలల నుంచే అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. దీంతో అత్తింటి నుంచి వచ్చేసిన మేఘనా.. కొన్నిరోజులుగా మైత్రినగర్‌లో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. అయితే శుక్రవారం భర్త వినయ్ కుమార్ నుంచి ఆమెకు విడాకుల నోటీసులు వచ్చాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మేఘనా.. వాటి విషయంలో భర్త, అత్తమామలతో గొడవపడింది. ఈ క్రమంలో గత రాత్రి 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.