హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పీఎస్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్ అపార్టుమెంట్లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది.
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగ్ పీఎస్ పరిధిలోని హైదర్ షాకోట్ లక్ష్మీ నరసింహ స్వామి కాలనీలోని సామ్రాట్ అపార్టుమెంట్లో రమ్యకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆమె ప్రాణాలు తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకుని..సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆమె భర్త గోపితో పాటు కుటుంబ సభ్యుల్ని ప్రశ్నిస్తున్నారు. (విషాదం: కరోనా భయంతో రిటైర్డ్ జడ్జి ఆత్మహత్య)
ఐదేళ్ల క్రితం గోపి, రమ్యకృష్ణకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే. భార్యభర్తల మధ్య కూడా ఎటువంటి కలతలు లేవని సమాచారం. జీవితం కూడా సంతోషంగా, సాఫీగా సాగిపోతోన్న సమయంలో రమ్యకృష్ణ ఆత్మహత్య పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని భర్త గోపి చెబుతున్నాడు. రమ్య ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు స్పందించాల్సి ఉంది.(ఢిల్లీలో వంగవీటి రాధా..ఏం చేస్తున్నారంటే ?)