గుజరాత్‌ గ్యాస్‌ కంపెనీలో పేలుడు.. 6గురి మృతి

| Edited By:

Jan 12, 2020 | 1:05 AM

గుజరాత్‌లోని వదోదర జిల్లా పద్రా తాలూకాలోని పారిశ్రామిక గ్యాస్ తయారీ సంస్థలో శనివారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పద్రాలోని గవాసాద్ గ్రామానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు సమీపంలోని ఆసుపత్రిలో మరణించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు […]

గుజరాత్‌ గ్యాస్‌ కంపెనీలో పేలుడు.. 6గురి మృతి
Follow us on

గుజరాత్‌లోని వదోదర జిల్లా పద్రా తాలూకాలోని పారిశ్రామిక గ్యాస్ తయారీ సంస్థలో శనివారం జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. పద్రాలోని గవాసాద్ గ్రామానికి సమీపంలో ఉన్న ఎయిమ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వద్ద ఉదయం 11 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఒకరు సమీపంలోని ఆసుపత్రిలో మరణించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.