అప్పుడే స్కూల్స్ రీ ఓపెనింగ్…క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర మంత్రి…

|

Jun 07, 2020 | 3:25 PM

మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ ఒక్క‌సారిగా అటాక్ చేయ‌డంతో ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో మార్చి ఎండింగ్ నుంచి స్కూళ్ల‌ని మూత‌ప‌డ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు.

అప్పుడే స్కూల్స్ రీ ఓపెనింగ్...క్లారిటీ ఇచ్చేసిన కేంద్ర మంత్రి...
Follow us on

మ‌హమ్మారి క‌రోనా వైర‌స్ ఒక్క‌సారిగా అటాక్ చేయ‌డంతో ప్ర‌భుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. దీంతో మార్చి ఎండింగ్ నుంచి స్కూళ్ల‌ని మూత‌ప‌డ్డాయి. స్కూళ్లు ఎప్పుడు తెరుస్తారనే అంశంపై పూర్తి క్లారిటీ రాలేదు. ఈ విష‌యంపై స్టూడెంట్స్, పేరెంట్స్, స్కూల్ యాజమాన్యాలు కూడా సందిగ్ధంలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో స్కూళ్లు రీ-ఓపెన్ చేసే అంశంపై క్లారిటీ ఇచ్చారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ఆగస్ట్ తర్వాతే పాఠ‌శాల‌లు పునఃప్రారంభం అవుతాయ‌ని చెప్పారు.

ఇండియాలో సుమారు 33 కోట్ల మంది విద్యార్థులు పాఠ‌శాల‌లు ఎప్పుడు తిరిగి ఓపెన్ చేస్తారా? అని గందరగోళంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 మార్గదర్శకాల ప్రకారం జూలైలో పాఠ‌శాల‌లు రీ ఓపెన్ చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అది కూదా అంద‌రికీ కాదు. 8 కంటే త‌క్కువ త‌రగ‌తుల వారిని మిన‌హాయించి, ఆ పైన స్టూడెంట్స్ కు మాత్రమే పాఠ‌శాల‌ల్లో త‌ర‌గ‌తులు ప్రారంభించే అవ‌కాశం ఉంది. మిగిలిన వారు ఇంటి వద్దే ఉండటం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం మరో బ్యాచ్ చొప్పున రెండు సెష‌న్ల‌లో విద్యార్థులు క్లాసులకు హాజరయ్యేలా ప్లానింగ్ రెడీ చేస్తున్నారు అధికారులు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉండే పాఠ‌శాల‌ల‌ను కాస్త ముందుగా ప్రారంభించ‌నున్నారు. ఆయ‌న చెప్పిన వివ‌రాలు ప్ర‌కారం ఆగ‌ష్టు రెండ‌వ వారంలో పాఠ‌శాల‌లు ప్రారంభం అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.