రిలయన్స్ రీస్టార్ట్… క‌ృష్ణ-గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి… ప్రకటించిన ఆర్ఐఎల్…

| Edited By: Pardhasaradhi Peri

Dec 20, 2020 | 10:56 AM

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుంచి తిరిగి గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది.

రిలయన్స్ రీస్టార్ట్... క‌ృష్ణ-గోదావరి బేసిన్ నుంచి గ్యాస్ ఉత్పత్తి... ప్రకటించిన ఆర్ఐఎల్...
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ తీరంలోని కృష్ణ-గోదావరి (కేజీ) బేసిన్‌ నుంచి తిరిగి గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించినట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. కేజీ-డీ6 క్షేత్రంలోని ఆర్‌-క్లస్టర్‌ నుంచి కొత్తగా గ్యాస్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. వచ్చే ఏడాదికల్లా ఈ క్లస్టర్‌ నుంచి రోజుకు 1.29 కోట్ల ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌‌ను వెలికితీయనన్నారు. బ్రిటిష్‌ పెట్రోలియం (బీపీ)తో కలిసి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఈ బ్లాకులో మరో రెండు గ్యాస్‌ క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది.

 

ఈ మూడు క్లస్టర్లు కాకినాడ తీరం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో లోతట్టు సముద్ర జలాల్లో ఉన్నాయి. 2022 నాటికి మిగతా రెండు క్లస్టర్ల నుంచి సహజ వాయువు ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మూడు క్లస్టర్ల నుంచి పూర్తి స్థాయిలో గ్యాస్‌ ఉత్పత్తి ప్రారంభమైతే దేశీయ గ్యాస్‌ అవసరాల్లో 25 శాతం తీరుతుందని అంచనా. సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 2,000 మీటర్ల లోతున ఉన్న ఈ బావుల నుంచి రిలయన్స్‌-బీపీ కంపెనీలు గ్యాస్‌ వెలికితీయబోతున్నాయి. ఆసియాలో ప్రస్తుతం మరే ప్రాంతంలోనూ సముద్ర జలాల్లో ఇంత లోతు నుంచి సహజ వాయువును వెలికి తీయడం లేదు.