ఆగస్టు 5న.. రాయబార కార్యాలయాలకు లడ్డూలు..!

ఆనందకరమైన సందర్భాలలో స్వీట్లు పంపిణీ చేసే భారతీయ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ యొక్క 'భూమి పూజ' వేడుక సందర్భంగా ప్రత్యేక సన్నాహాలు చేసింది.

ఆగస్టు 5న.. రాయబార కార్యాలయాలకు లడ్డూలు..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2020 | 6:21 PM

ఆనందకరమైన సందర్భాలలో స్వీట్లు పంపిణీ చేసే భారతీయ సంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకుని, రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ్ మందిర్ యొక్క ‘భూమి పూజ’ వేడుక సందర్భంగా ప్రత్యేక సన్నాహాలు చేసింది. ట్రస్ట్ అయోధ్యలో స్వీట్ల పంపిణీతో పాటు ఢిల్లీలోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాలకు బికనేరి లడ్డూలను బహూకరించాలని నిర్ణయించుకుంది. ఆగస్టు 5 న జరగబోయే రామ మందిర భూమి పూజకు ట్రస్టు అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేసింది.

ఒక్కో స్వీట్ ప్యాకెట్‌లో నాలుగు లడ్డూల చొప్పున ఉంటాయని ట్రస్ట్ పేర్కొంది. అలా.. పంపిణీ నిమిత్తమై 4 లక్షల లడ్డూల ప్యాకెట్లను సిద్ధం చేసింది ట్రస్ట్. ఆగస్టు 5 న జరగబోయే భూమి పూజకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్యకు చేరుకొని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నగరవాసులను తమ ఇళ్ల వద్ద మట్టి దీపాలను వెలిగించాలని ట్రస్టు కోరింది.

Read More:

నర్సులకు భారీ ఆఫర్లు.. విమానచార్జీలు.. 50 వేల జీతం..!

ఇంటర్ సెకండియర్‌ విద్యార్థులందరూ పాస్‌.. అందుబాటులో మెమోలు..!