ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ!

| Edited By:

Jun 19, 2019 | 4:19 PM

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ‘ఇండియన్ రైల్వేస్’… రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా ఆలోచిస్తోంది. త్వరలో రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు టూరిస్ట్ రూట్లల్లో ప్రైవేట్ సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ప్రైవేట్ సంస్థలకు వేలం నిర్వహించనుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి […]

ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ!
Follow us on

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ‘ఇండియన్ రైల్వేస్’… రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా ఆలోచిస్తోంది. త్వరలో రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు టూరిస్ట్ రూట్లల్లో ప్రైవేట్ సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ప్రైవేట్ సంస్థలకు వేలం నిర్వహించనుంది.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి అప్పగించనుంది. టికెట్ల జారీ, రైళ్లల్లో ఇతర సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. అయితే రద్దీలేని, టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ రైళ్లను నడిపే వీలుంది. ఈ రూట్లను కూడా రైల్వే శాఖ ఎంపిక చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనుంది. అయితే ఒప్పందం చేసుకునే ముందే కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోని… ఆ తర్వాతే ప్రైవేట్ ఆపరేటర్లకు ఆహ్వానం పలుకనుంది.