AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మత్తులో జోగుతున్న ఎక్సైజ్‌శాఖ..పాలమూరులో ఏరులైపారుతున్న కల్తీ కల్లు..ఇప్పటికే ఇద్దరు మృతి..

పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాటుసారా కూడా గుప్పుమంటోంది. పల్లెలు, బస్తీల్లో మళ్లీ నాటుసారా తయారీ, సరఫరా పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేలుతున్నారు.

మత్తులో జోగుతున్న ఎక్సైజ్‌శాఖ..పాలమూరులో ఏరులైపారుతున్న కల్తీ కల్లు..ఇప్పటికే ఇద్దరు మృతి..
Sanjay Kasula
|

Updated on: Dec 14, 2020 | 6:14 AM

Share

పాలమూరు జిల్లాలో కల్తీ కల్లు ఏరులైపారుతోంది. పట్టించుకునే నాథుడు లేకపోవడంతో నాటుసారా కూడా గుప్పుమంటోంది. పల్లెలు, బస్తీల్లో మళ్లీ నాటుసారా తయారీ, సరఫరా పెరిగిపోవడంతో జనం మత్తులో మునిగితేలుతున్నారు. అయితే ఈ మత్తు ఇప్పుడు వారి ప్రాణాల మీదకు వచ్చింది. కల్తీ కల్లుకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

మహబూబ్‌నగర్‌జిల్లా జడ్చర్లకు చెందిన ఖాసీం, వెంకటేశులు కల్తీ కల్లు తాగి మృతి చెందారు. వీళ్లిద్దరూ శ్రీనివాస్‌ అనే మరో వ్యక్తితో కలిసి జడ్చర్ల సమీపంలోని ఆలూరు గ్రామంలో పీకలదాకా కల్లు తాగారు. అయితే కొద్దిసేపటి తర్వాత ముగ్గురు తూలుతూ కిందపడిపోయారు. పరిస్థితి విషమంగా మారడంతో వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా వెంకటేశ్‌, ఖాసీంలు ఇద్దరు మార్గ మధ్యంలోనే చనిపోయారు. మరోవ్యక్తి శ్రీనివాస్‌ పరిస్థితి నిలకడగా ఉండటంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆలూరు గ్రామానికి వెళ్లి ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు పోలీసులు. అక్కడున్న కల్తీ కల్లును స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లే కల్తీకల్లు ప్రాణాలు తీస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తులో జోగుతున్న ఎక్సైజ్‌ అధికారులు ఇప్పటికైనా గ్రామాల్లో కల్తీకల్లు అమ్మకాలపై నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

గత కొంతకాలంగా తెలంగాణలో నాటుసారా తయారీ తగ్గిపోయింది. ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించి నాటుసారా భట్టిలను ధ్వంసం చేయించింది. పోలీసులు కూడా కొన్ని నెలల పాటు ఫోకస్‌ పెట్టడంతో చాలా ప్రాంతాల్లో నాటుసారా తగ్గిపోయింది. అయితే ఇప్పుడు పాలమూరు జిల్లాలో మళ్లీ కల్తీ కల్లు తాగి ఇద్దరు చనిపోవడంతో ఇటు ఎక్సైజ్‌, అటు పోలీస్‌ అధికారులు కూడా అలర్టయ్యారు.

స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
స్టూడెంట్ ని కొట్టిన టీచర్... కోర్టుకెళ్లిన పేరెంట్స్.. చివరికి..
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
స్టార్ హీరోలతో సినిమాలు.. కానీ ఇప్పుడు కనిపించకుండాపోయింది..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
ఇన్‌స్టా రీల్ కోసం విద్యార్ధులు చేసి పనికి పోలీసుల పరుగులు..
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
వైభవ్ సూర్యవంశీని వెంటనే అరెస్ట్ చేయండి.. ఆ దేశం డిమాండ్
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
నెల రోజులు మాంసం తినకపోతే బాడీలో ఇన్ని మార్పులా?
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
మహా శివరాత్రి.. ఫిబ్రవరి 15 లేదా 16? చెక్ పెట్టిన జ్యోతిష్యులు
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
ఛీ నువ్వేం కొడుకువు రా..! మద్యం మత్తులో కన్న తండ్రి అని చూడకుండా
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
అవాంఛిత గర్భధారణకు చెక్.. ఈ మ్యాజిక్ స్టిక్ తో మూడేళ్లు సేఫ్!
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా
డాక్యుమెంట్స్ పోగొట్టిన ఎస్బీఐకు వినియోగదారుల ఫోరం భారీ జరిమానా