‘జాక్స్’ ఇక లేదు..పూరి ఎమోషనల్ పోస్ట్
పూరి జగన్నాథ్…ఈ క్రేజీ డైరక్టర్ గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన సినిమాలు ఫ్లాపైనా పూరి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన సినిమాలకు బ్యాడ్ టైటిల్స్ పెడుతూ.. సొసైటీలో ఉన్న కంపును కడిగేస్తూ ఉంటాడు పూరి. కెరీర్లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా పడి లేచిన కెరటం పూరి. తనకు ఎదురైన మోసాలు వల్ల ఎమోషన్స్ లేనట్లు కనిపించే పూరి జగన్నాథ్…చాలా సెన్సిటివ్ అని అతనితో ట్రావెల్ అయ్యేవాళ్లు చెప్పే మాట. మనుషులు మోసం […]
పూరి జగన్నాథ్…ఈ క్రేజీ డైరక్టర్ గురించి స్పెషల్గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన సినిమాలు ఫ్లాపైనా పూరి ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. తన సినిమాలకు బ్యాడ్ టైటిల్స్ పెడుతూ.. సొసైటీలో ఉన్న కంపును కడిగేస్తూ ఉంటాడు పూరి. కెరీర్లో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కూడా పడి లేచిన కెరటం పూరి. తనకు ఎదురైన మోసాలు వల్ల ఎమోషన్స్ లేనట్లు కనిపించే పూరి జగన్నాథ్…చాలా సెన్సిటివ్ అని అతనితో ట్రావెల్ అయ్యేవాళ్లు చెప్పే మాట.
మనుషులు మోసం చేస్తారు కానీ..జంతువులు, పక్షులకు స్వార్థం తెలియదనేది పూరి నమ్మే సూత్రం. అందుకే తను ఎక్కువగా పెట్స్తో గడుపుతూ ఉంటాడు. తన ఇంట్లో కూడా ఎప్పుడూ అవే దర్శనమిస్తాయి. తాజాగా పూరి పెంచుకునే పెట్ డాగ్ జాక్స్ అనారోగ్య కారణాల వల్ల మరణించింది. ఈ విషయంపై ఆయన చాలా ఎమోషనల్గా రియాక్టయ్యాడు. కెరీర్ డౌన్ ఫాల్లో ఉన్నప్పుడు ఆ పెట్కి తిండి పెట్టడానికి కూడా డబ్బులు లేక ఫ్రెండ్కి ఇచ్చేశాడట. ఆ తర్వాత కొంతకాలానికి తిరిగి తెచ్చుకున్నా కూడా అది పూరీపై అలిగిందట. కనీసం ఆయన వైపు కూడా చూడలేదట. ‘‘నేను లైఫ్లో ఎంతమందిని బాధపెట్టానో తెలియదు కానీ నా పెట్ జాక్స్ను మాత్రం చాలా బాధపెట్టాను’’ అని సోషల్ మీడియాలో ఎమోషనల్గా పోస్ట్ చేశాడు పూరి జగన్నాథ్. స్టార్ డైరక్టర్కు జంతువులు పట్ల ఉన్న ప్రేమను చూసి పలువురు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
— PURIJAGAN (@purijagan) April 16, 2019