26 గంటల కౌంట్డౌన్ మొదలైంది…
షార్ సెంటర్ మరో అద్భుమైన ప్రయోగానికి వేదికగా మారుతోంది. పీఎస్ఎల్వీ సీ-49 వాహక నౌక కౌంట్డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు ప్రారంభమైంది. కౌంట్డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది. శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు రాకెట్ను నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. కరోనా లాక్డౌన్ అనంతరం మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే […]

షార్ సెంటర్ మరో అద్భుమైన ప్రయోగానికి వేదికగా మారుతోంది. పీఎస్ఎల్వీ సీ-49 వాహక నౌక కౌంట్డౌన్ శుక్రవారం మధ్యాహ్నం 1.02గంటలకు ప్రారంభమైంది. కౌంట్డౌన్ నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగనుంది.
శనివారం మధ్యాహ్నం 3.02గంటలకు రాకెట్ను నింగిలోకి దూసుకుపోనుంది. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ భూ పరిశీలన ఉపగ్రహం రిశాట్ -2 బీఆర్2తో పాటు పది విదేశీ వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.
కరోనా లాక్డౌన్ అనంతరం మధ్య ఇస్రో ఈ ఏడాది చేపట్టనున్న మొట్టమొదటి ఉపగ్రహ ప్రయోగం ఇదే కావడం విశేషం. మార్చి నుంచి అన్ని అంతరిక్ష కార్యకలాపాలు మందగించాయి. డిసెంబర్ నాటికి కొత్త రాకెట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పరీక్షించేందుకు ఇస్రో ప్లాన్ చేస్తోంది.
రిశాట్-2 బీఆర్2 శాటిలైట్ భూమి పరిశీలనకు ఉపయోగపడనుంది. సింథటిక్ ఎపర్చర్ రాడార్ (ఎస్ఏఆర్) ఏ వాతావరణ పరిస్థితుల్లోనా భూమిని నిశితంగా పరీక్షించవచ్చు. చైనాతో ఎల్ఏసీ వెంట నెలకొన్న సరిహద్దుల ఉద్రిక్తల మధ్య డ్రాగన్ ఎత్తుగడలను తెలుసుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అలాగే నిఘాతో పాటు వ్యవసాయం, అటవీ, నేల తేమ, భూగర్భశాస్త్రం, తీర పర్యవేక్షణ, వరదలను పరిశీలించేందుకు ఈ ఉపగ్రహం ద్వారా పర్యవేక్షించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. మిషన్ పూర్తయిన వెంటనే డిసెంబర్లో జీశాట్-12 ఆర్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేందుకు పీఎస్ఎల్వీ-సీ 50 మిషన్ను చేపట్టాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.