తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని

| Edited By:

Apr 06, 2019 | 11:44 AM

నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని కలిగించాలని ఆశిస్తున్నాను. – రాష్ట్రపతి […]

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
Follow us on

నేడు తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ.. రాష్ట్రపతి కోవింద్‌, ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సోదరసోదరీమణులకు, ప్రపంచంలోని తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పండుగ మీకు సుఖసంతోషాలను, సౌభాగ్యాన్ని కలిగించాలని ఆశిస్తున్నాను.

– రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్

తెలుగు ప్రజలందరికీ శ్రీ వికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మార్పునకు ప్రతీక అయిన వికారి నామ సంవత్సర ఉగాది మీ అందరి జీవితాల్లోకి సానుకూల మార్పులను తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆత్మవిశ్వాసాన్ని ఆలంబనగా చేసుకుంటే, కొత్తపయనం ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది. అలాంటి ప్రతి ప్రయత్నానికి ఉగాదిలాంటి ఓ రోజును ప్రారంభంగా తీసుకోవాలి. మార్పు దిశగా ముందుకు సాగే క్రమంలో ఉగాదిని ఆహ్వానించాలి, ఆస్వాదించాలి.

– ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పర్వదినం సందర్భంగా మీ ఆకాంక్షలు నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరు సంపూర్ణ అరోగ్యంతో, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.
– ప్రధానమంత్రి నరేంద్రమోదీ

భారతీయులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు.

– రాహుల్‌గాంధీ