రూ.100 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ.. లక్నో యూనివర్సిటీ వేడుకల్లో పోస్టల్ స్టాంపు అవిష్కరణ..

|

Nov 25, 2020 | 6:33 PM

ల‌క్నో యూనివ‌ర్సిటి వందేళ్ల స్వర్ణోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 నాణేన్ని విడుదల చేశారు.

రూ.100 నాణేన్ని విడుదల చేసిన ప్రధాని మోదీ.. లక్నో యూనివర్సిటీ వేడుకల్లో పోస్టల్ స్టాంపు అవిష్కరణ..
Follow us on

ల‌క్నో యూనివ‌ర్సిటి వందేళ్ల స్వర్ణోత్సవం పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 నాణేన్ని విడుదల చేశారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌క్నో యూనివ‌ర్సిటి ప్రారంభ‌మై నేటికి స‌రిగ్గా వందేళ్లు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ఆ యూనివ‌ర్సిటీ 100వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వహించారు. వర్చువల్ పద్దతిలో నిర్వహించిన స్వర్ణోత్స కార్యక్రమంలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ల‌క్నో యూనివ‌ర్సిటీ వందేళ్లు పూర్తి చేసుకున్నందుకు ప్ర‌త్యేక పోస్ట‌ల్ స్టాంపును విడుదల చేశారు. అలాగే ఈ సందర్బంగా రూ.100 నాణేన్ని ప్ర‌ధాని త‌న చేతుమీదుగా విడుద‌ల చేశారు.