బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డర్లతో ప్రధాని భేటీ

|

Jul 29, 2020 | 2:19 AM

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో బుధవారం జ‌రిగే మేధోమ‌ధ‌న స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొననున్నారు. భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక‌పై...

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డర్లతో ప్రధాని భేటీ
Follow us on

బ్యాంకులు, ఎన్‌.బి.ఎఫ్‌.సిల స్టేక్ హోల్డ‌ర్ల‌తో బుధవారం జ‌రిగే మేధోమ‌ధ‌న స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పాల్గొననున్నారు. భ‌విష్య‌త్ దార్శ‌నిక‌త‌, ప్ర‌ణాళిక‌పై చ‌ర్చించేందుకు ఏర్పాటైన ఈ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతారు. రుణ ఉత్ప‌త్తులు, స‌మ‌ర్ధ పంపిణీ విధానాలు, సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా ఆర్థిక సాధికార‌త‌, ఆర్థిక రంగం స్థిరత్వం, సుస్థిర‌త‌ల‌కు ముందుచూపుతో కూడిన వివేక‌వంత‌మైన విధానాలు వంటి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశంలో వివిధ విభాగాలకు చెందిన ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన‌నున్నారు.