జిన్‌పింగ్‌కు గిప్టులుగా భారతీయ కళాఖండాలు..అవేంటో తెలుసా?

|

Oct 12, 2019 | 2:20 PM

పెచ్చరిల్లుతున్న విపరీత, తీవ్రవాద ధోరణులు రెండు దేశాలకూ ప్రమాదకరమేనని, వీటిని సంయుక్తంగా ఎదుర్కొందామని భారత్‌, చైనా నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన చైనా అధినేత జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి మహాబలిపురంలోని సముద్రతీర రిసార్టులో ప్రైవేటు విందు ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటల సేపు విందు సమావేశం సాగింది. ఇద్దరు నేతలూ వివిధాంశాలపై పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అదిరిపోయే కానుకలు ఇవ్వనున్నారు. వీరిద్దరి మధ్య […]

జిన్‌పింగ్‌కు గిప్టులుగా భారతీయ కళాఖండాలు..అవేంటో తెలుసా?
Follow us on

పెచ్చరిల్లుతున్న విపరీత, తీవ్రవాద ధోరణులు రెండు దేశాలకూ ప్రమాదకరమేనని, వీటిని సంయుక్తంగా ఎదుర్కొందామని భారత్‌, చైనా నిర్ణయించాయి. భారత పర్యటనకు వచ్చిన చైనా అధినేత జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి మహాబలిపురంలోని సముద్రతీర రిసార్టులో ప్రైవేటు విందు ఇచ్చారు. దాదాపు రెండున్నర గంటల సేపు విందు సమావేశం సాగింది. ఇద్దరు నేతలూ వివిధాంశాలపై పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు.

ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అదిరిపోయే కానుకలు ఇవ్వనున్నారు. వీరిద్దరి మధ్య అధికారిక లాంఛనాలకు దూరంగా సమావేశం జరుగుతున్న విషయం తెలిసిందే. మహాబలిపురం వేదికగా వీరి భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు ప్రధానిమోదీ మంచి కానుకలు సిద్ధం చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడే విధంగా ఉండే మన దేశ కళాకృతులను జిన్‌పింగ్‌కు బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరు అడుగులు ఎత్తుండే దీపపు స్తంభాలు, మూడు అడుగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా ఇస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి.

తమిళనాడు హస్తకళా నైపుణ్యాన్ని కళ్లకు కట్టేలా ఇవి ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంభాలు రెండు కలిసి 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టిందట. సరస్వతి దేవి నృత్యం చేస్తున్న భంగిమలో గీసిన చిత్రలేఖనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి 45 రోజులు పట్టిందట. మరోవైపు ప్రధాని మోదీ కోసం జిన్‌పింగ్‌ కూడా ఓ కానుకను తెచ్చారట. అదేంటో మాత్రం బయటకు వెల్లడించలేదు.