మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ పాక్

| Edited By:

Mar 14, 2019 | 11:38 AM

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపిస్తోంది. ఓ వైపు శాంతియుత చర్చలు చేపడుదామంటూనే.. మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా రెండు పాకిస్థాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వద్ద అలజడి సృష్టించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో పూంచ్ సెక్టార్ వద్ద ఈ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వచ్చి వెళ్ళాయి. మంగళవారం రాత్రి ఎల్వోసీ వద్దకు వేగంగా వచ్చిన ఈ విమానాలు భారత వాయుసేన రాడార్లు గుర్తించేలోపే తిరిగి వెనక్కి వెళ్లాయి. ఇండియన్ ఎయిర్ […]

మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడ్డ పాక్
Follow us on

పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపిస్తోంది. ఓ వైపు శాంతియుత చర్చలు చేపడుదామంటూనే.. మరోవైపు కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా రెండు పాకిస్థాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వద్ద అలజడి సృష్టించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమీపంలో పూంచ్ సెక్టార్ వద్ద ఈ విమానాలు సూపర్ సోనిక్ వేగంతో వచ్చి వెళ్ళాయి. మంగళవారం రాత్రి ఎల్వోసీ వద్దకు వేగంగా వచ్చిన ఈ విమానాలు భారత వాయుసేన రాడార్లు గుర్తించేలోపే తిరిగి వెనక్కి వెళ్లాయి.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించే లోపే ఆ విమానాలు కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోయాయి. ఈ సమయంలో సమీప గ్రామాల ప్రజలకు భారీ శబ్దాలు వినిపించాయి. కాగా, భారత వాయుసేన రాడార్లపై విమానాల రాక స్పష్టంగా కనిపించింది. దాంతో సరిహద్దు వెంబడి ఉన్న అన్ని ఎయిర్ బేస్ లలో హైఅలర్ట్ ప్రకటించారు. కాగా ఫిబ్రవరి 27న పాక్ యుద్ధ విమానాలు భారత సైనిక స్థావరాలపై దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే.