360 మంది భారత ఖైదీలను విడుదల చేయనున్న పాక్‌

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత్‌కు చెందిన 360 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు పాక్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నాలుగు విడతల్లో వీరందరినీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 100మందిని అప్పగించనున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 7) జైలు నుంచి విడుదల చేసి సోమవారానికి వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో ఏప్రిల్‌ 15న 100 మందిని, మూడో విడతలో ఏప్రిల్‌ 22న 100 మందిని, నాలుగో […]

360 మంది భారత ఖైదీలను విడుదల చేయనున్న పాక్‌

Edited By:

Updated on: Apr 06, 2019 | 1:49 PM

ఇస్లామాబాద్‌ : పాకిస్థాన్‌ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారత్‌కు చెందిన 360 మంది ఖైదీలను విడుదల చేయనున్నట్లు పాక్‌ అధికారులు శుక్రవారం ప్రకటించారు. నాలుగు విడతల్లో వీరందరినీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 100మందిని అప్పగించనున్నారు. ఆదివారం (ఏప్రిల్‌ 7) జైలు నుంచి విడుదల చేసి సోమవారానికి వాఘా సరిహద్దు వద్దకు తీసుకొచ్చి భారత్‌కు అప్పగించనున్నట్లు వెల్లడించారు. రెండో విడతలో ఏప్రిల్‌ 15న 100 మందిని, మూడో విడతలో ఏప్రిల్‌ 22న 100 మందిని, నాలుగో విడతలో ఏప్రిల్‌ 29న మిగిలిన 60 మందిని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. 2010 సెప్టెంబర్‌లోనూ ఇదే విధంగా 442 మంది భారత ఖైదీలను పాకిస్థాన్ విడిచిపెట్టింది. అయితే ఈ ఖైదీల్లో 355 మంది మత్స్యకారులు కాగా అయిదుగురు ఇతరులున్నారు. తాము చేపడుతున్న ఈ సుహృద్భావపూరిత చర్య నేపథ్యంలో భారత్‌ కూడా అదేవిధంగా ప్రతిస్పందిస్తుందంటూ.. పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.