పాకిస్తాన్ కుట్రలకు బలై ఆ దేశ చెరలో బంధీగా ఉన్న మాజీ నేవీ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ కేసులో మరోసారి వాదనలు వినేందుకు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక ధర్మాసనాన్ని ఇస్లామాబాద్ హైకోర్టు ఏర్పాటు చేసినట్లు పాక్ మీడియా పేర్కొంది. దీనికి ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అథర్ మినల్లా నాయకత్వం వహించనున్నారు. అలానే జాదవ్ తరఫున వాదనలు వినిపించేందుకు ఒక న్యాయవాదిని కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
అంతర్జాతీయ న్యాయస్థానాలకు సంబంధించి సవరణలు చేసిన కొత్త బిల్లును ఈవారం పాక్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో చేసిన సవరణలు అమల్లోకి వస్తే జాదవ్ తన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాలు చేయవచ్చని సమాచారం. జులై 17, 2019న జాదవ్ కేసు విచారణ సందర్భంగా ఐసీజే సూచనల మేరకు ఈ చట్టంలో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం పాక్ సర్కార్ కొత్త కుట్రకు తెరలేపింది. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ వేయడానికి జాదవ్ నిరాకరించాడని, తొలుత దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్పైనే విచారణ జరపాలని నిర్ణయించినట్లు తెలిపింది. దీంతో జాదవ్ తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు అంతర్జాతీయ సమాజానికి చూపే కుట్ర పన్నుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రణాళిక ప్రకారమే పాక్ జాదవ్ తనకున్న అవకాశాలను ఉపయోగించుకోకుండా సంబంధిత పత్రాలు ఇవ్వకుండా అంతర్జాతీయ చట్టాలను ఉల్లఘింస్తోందని భారత విదేశాంగ శాఖ ఆరోపిస్తోంది. గతవారం భారత్ కోరిక మేరకు రెండోసారి జాదవ్ను కలిసేందుకు న్యాయవాది ద్వారా దౌత్యవేత్తలకు అనుమతినిచ్చింది. మొదటిసారిగా 2019 సెప్టెంబరు నెలలో భారత ప్రతినిధులు జాదవ్ ను కలుసుకుంది. అయితే, పాక్ చేసే కుట్రలను ప్రపంచ దేశాలకు ఎత్తిచూపిన తన వక్రబుద్ధిని ఏ మాత్రం మార్చుకోవడంలేదు దాయాది దేశం.
Islamabad High Court to hear case seeking lawyer appointment for Indian spy on Aug 3 https://t.co/1LN4TZ7CWR
— The Pakistan Post (@TPPNewsOfficial) July 30, 2020