పాకిస్తాన్‌ చెర నుంచి విముక్తులైన జాలర్లు.. మరికొద్దిసేపట్లో విజయవాడకు!

| Edited By:

Jan 07, 2020 | 4:09 PM

పాకిస్తాన్ నుండి విడుదలైన జాలర్లు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జాలర్లతో పాటుగా ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా శంషాబాద్ వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి రోడ్‌ మార్గం ద్వారా జాలర్లు విజయవాడకు బయలు దేరారు. కాగా.. మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వయంగా వారిని వాఘా బోర్డర్‌ అమృత్‌సర్‌ మీదుగా ఢిల్లీకి తీసుకువచ్చారు. 14 నెలల తర్వాత దేశంలో అడుగుపెట్టిన జాలర్ల కళ్లలో ఆనందం కనిపించింది. తమవారిని కలుస్తున్నామనే సంతోషంగా ఉప్పొంగిపోతోంది. రెండేళ్ల […]

పాకిస్తాన్‌ చెర నుంచి విముక్తులైన జాలర్లు.. మరికొద్దిసేపట్లో విజయవాడకు!
Follow us on

పాకిస్తాన్ నుండి విడుదలైన జాలర్లు ఢిల్లీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. జాలర్లతో పాటుగా ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా శంషాబాద్ వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి రోడ్‌ మార్గం ద్వారా జాలర్లు విజయవాడకు బయలు దేరారు. కాగా.. మంత్రి మోపిదేవి వెంకటరమణ స్వయంగా వారిని వాఘా బోర్డర్‌ అమృత్‌సర్‌ మీదుగా ఢిల్లీకి తీసుకువచ్చారు. 14 నెలల తర్వాత దేశంలో అడుగుపెట్టిన జాలర్ల కళ్లలో ఆనందం కనిపించింది. తమవారిని కలుస్తున్నామనే సంతోషంగా ఉప్పొంగిపోతోంది.

రెండేళ్ల తర్వాత తమ కుటుంబ పెద్దలు క్షేమంగా ఇంటికి చేరుకుంటుండటంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. పాక్‌ జైళ్లలో ఉన్న తమ వారు ఇక వస్తారో రారో అని ఇప్పటివరకూ జాలర్ల కుటుంబసభ్యులు ఆందోళనలో ఉన్నారు.