AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టు చివరి వారంలో ఓయూ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు..!

హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎండ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను

ఆగస్టు చివరి వారంలో ఓయూ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 1:08 PM

Share

Osmania University: హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆగస్టు, సెప్టెంబర్‌లో ఎండ్ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల విద్యార్థులను ఆగస్టు రెండో వారం లోపు పరీక్ష ఫీజులను చెల్లించాలని విశ్వవిద్యాలయం తెలిపింది.

ఎల్‌ఎల్‌బి (3వ సంవత్సరం), ఎల్‌ఎల్‌బి హానర్స్ (3వ సంవత్సరం), BA.LL.B (5వ సంవత్సరం), BB.A LL.B (5వ సంవత్సరం), B.COM LL.B (5వ సంవత్సరం), మాస్టర్ ఆఫ్ లా (LLM) చివరి సంవత్సరం/సెమిస్టర్. ఈ విభాగాల విద్యార్థులు తమ పరీక్ష ఫీజును ఆగస్టు 12 లోగా లేదా ఆలస్య రుసుముతో ఆగస్టు 19 లోగా చెల్లించవచ్చని నోటిఫికేషన్ లో తెలిపింది.

మాస్టర్ ఆఫ్ అప్లైడ్ మేనేజ్‌మెంట్ (ఎంఏఎం), 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బిబిఎ / ఎంబీఏ కోర్సులకు రెగ్యులర్, బ్యాక్‌లాగ్, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతాయని తెలిపింది. ఈ విభాగాల విద్యార్థులు పరీక్ష ఫీజును ఆగస్టు 6 లోగా లేదా ఆలస్య రుసుముతో ఆగస్టు 14 లోపు చెల్లించవచ్చని నోటిఫికేషన్ లో తెలిపింది.

యూజీసీ జూలై 6 న విడుదల చేసిన సవరించిన మార్గదర్శకాలలో విశ్వవిద్యాలయాలను ఎండ్-సెమిస్టర్ పరీక్షలు, ‘తప్పనిసరి’ బ్యాక్‌లాగ్ పరీక్షలు సెప్టెంబర్ లోగా నిర్వహించాలని కోరింది.

Also Read: తెలంగాణలో.. మూతపడనున్న 16 ఇంజనీరింగ్‌ కాలేజీలు..!