టోక్యో ఒలింపిక్స్​ సందర్శకులకు కరోనా టీకా ఫ్రీ.. ప్రయత్నాలు మొదలు పెట్టిన ఒలింపిక్​ పాలకమండలి

|

Nov 16, 2020 | 7:53 PM

కరోనా తర్వాత తొలి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం జపాన్‌లో జరుగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్​కు భారీగా సందర్శకులు వస్తారని ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ అభిప్రాయపడ్డారు...

టోక్యో ఒలింపిక్స్​ సందర్శకులకు కరోనా టీకా ఫ్రీ.. ప్రయత్నాలు మొదలు పెట్టిన ఒలింపిక్​ పాలకమండలి
Follow us on

కరోనా తర్వాత తొలి అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం జపాన్‌లో జరుగనుంది. ఈ వేడుక కోసం ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. టోక్యో ఒలింపిక్స్​కు భారీగా సందర్శకులు వస్తారని ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది వేసవిలో జరగబోయే ఒలింపిక్స్​ చూసేందుకు, ప్రేక్షకులు స్టేడియాలకు వస్తారని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్​ బాచ్​ ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వ క్రీడల చూడటం కోసం జపాన్​ వచ్చే సందర్శకులకు టీకాలను వేయడానికి ఒలింపిక్​ పాలకమండలి ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు.

రెండు రోజుల జపాన్​ పర్యటనలో భాగంగా టోక్యో ఒలింపిక్స్​ నిర్వహణపై ప్రధానమంత్రి యోషిహిదే సుగాతో పాటు విశ్వక్రీడల నిర్వాహకులతో థామస్​ బాచ్​ సమావేశమయ్యారు. ఆ తర్వాత ఒలింపిక్స్​ నిర్వహకులపై బాచ్ ప్రశంసలు కురిపించారు.