గొర్రెల కాపరితో దోవల్‌ ఏం మాట్లాడారు?

|

Aug 11, 2019 | 5:26 AM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు​. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు […]

గొర్రెల కాపరితో దోవల్‌ ఏం మాట్లాడారు?
NSA reaches out to people in Anantnag, interacts with cattletraders, locals
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్​లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ దోవల్​ విస్తృతంగా పర్యటిస్తున్నారు. రెండురోజుల క్రితం షోపియాన్​లో స్థానికులతో మాట్లాడిన దోవల్ తాజాగా అనంత్​నాగ్​ జిల్లాలో ప్రత్యక్షమయ్యారు.

రోడ్డుపై వెళుతుండగా గొర్రెల వ్యాపారులను చూసి, ఆగి వారితో కాసేపు ముచ్చటించారు​. గొర్రెల ఆహారం, బరువు, ధర వంటి వివరాలు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ గొర్రెలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని ఓ యువకుడిని అడిగారు దోవల్​. అందుకు సమాధానంగా కార్గిల్​, ద్రాస్​ నుంచి తీసుకొచ్చాం అని చెప్పిన అతను.. మీకు ద్రాస్​ ఎక్కడ ఉంటుందో తెలుసా? అని దోవల్‌ను తిరిగి ప్రశ్నించాడు. అనంత్‌నాగ్‌ డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ ఖలీద్‌ జనగిర్‌ కలగజేసుకొని దోవల్ గురించి అతనికి వివరించారు.