తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకల కారణంగా 18 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంటర్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం, మూడున్నర లక్షల మంది విద్యార్ధులు ఫెయిల్ కావడంతో NHRC ఈ కేసును సుమోటుగా స్వీకరించింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది.