ఒడిశాలో ఒక్కరోజే 3,384 మందికి కరోనా

|

Aug 27, 2020 | 1:15 PM

కరోనా మహమ్మారి ఒడిశాలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 3,384 మందికి వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,986కు చేరింది.

ఒడిశాలో ఒక్కరోజే  3,384 మందికి కరోనా
coronavirus
Follow us on

భారత్ లో కరోనా మహమ్మారి కరాళనృత్యం కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో కరోనా కేసులు 33లక్షలు దాటాయి. కరోనా మహమ్మారి ఒడిశాలో విజృంభిస్తోంది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా 3,384 మందికి వైరస్‌ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,986కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 27,672 యాక్టివ్‌ కేసులు ఉండగా, ఇక ఇప్పటివరకు 62,813 మంది కరోనా వైరస్‌ నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 448కి చేరిందని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. నిన్న ఒకే రోజు 68,090 కరోనా టెస్టులు చేయగా, మొత్తం 15,53,257 టెస్టులు చేసినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఖుర్దాలో 587, కటక్‌ 492, బాలాసోర్ 197, సంబల్‌పూర్‌ 182, మయూర్‌భంజ్‌ 177, గంజాం 177, జాజ్‌పూర్‌లో 176, బార్గర్‌ 157, రాయగఢ 154, పూరి 121, సుందర్‌గర్‌ 101లో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.