టీవీ సీరియల్ నటిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్..!

| Edited By:

Jun 19, 2019 | 1:32 PM

టీవీ సీరియల్ నటి రాగ మాధురిపై దాడి జరిగిన ఉదంతం కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజుల క్రితం తన బంగారు గొలుసు పోయిందని ఆమె హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీలో తనహెయిర్ డ్రెస్సర్ జ్యోతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే పోయిన గొలుసు దొరికిందంటూ తిరిగి రాగ మాధురి కుటుంబసభ్యులు […]

టీవీ సీరియల్ నటిపై దాడి కేసులో కొత్త ట్విస్ట్..!
Follow us on

టీవీ సీరియల్ నటి రాగ మాధురిపై దాడి జరిగిన ఉదంతం కొత్త మలుపు తిరిగింది. కొన్ని రోజుల క్రితం తన బంగారు గొలుసు పోయిందని ఆమె హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ చోరీలో తనహెయిర్ డ్రెస్సర్ జ్యోతితో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉందంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొనడంతో.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే పోయిన గొలుసు దొరికిందంటూ తిరిగి రాగ మాధురి కుటుంబసభ్యులు పోలీసులకు చెప్పగా, జ్యోతికను వారు విడుదల చేశారు. దీంతో ఆగ్రహించిన హెయిర్ డ్రెస్సర్ జ్యోతిక కొంతమంది మనుషులను తీసుకెళ్లి, సెట్‌లో ఉన్న రాగ మాధురిపై దాడి చేయించినట్టు తెలిసింది. వారి నుంచి తప్పించుకున్న రాగ మాధురి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు తిరిగి జ్యోతిక, తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.