AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వినియోగదారులకు అలెర్ట్.. ఆ మూడింటికి ఆధార్ తప్పనిసరి.!

జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్ పుణ్యమా అని.. ముఖ్యమైన మూడు అంశాలకు ఆధార్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందేనని.. లేదంటే ఆ మూడుసేవలు వినియోగదారుడికి లభించే అవకాశం ఉండదని ప్రభుత్వం తేల్చేసింది.

వినియోగదారులకు అలెర్ట్.. ఆ మూడింటికి ఆధార్ తప్పనిసరి.!
Ravi Kiran
|

Updated on: Jul 03, 2020 | 7:03 PM

Share

సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్.. గ్యాస్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్.. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్.. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా ఆధార్.. ఇలా మన బ్రతుకు జట్కా బండిలో ప్రతీ చిన్న పనికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా ఆధార్‌తో అనుసంధానం చేయించకపోతే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సదుపాయాలు కూడా దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా అన్నింటికీ ఆధార్‌ అవసరం. అయితే తాజాగా జూలై 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త రూల్ పుణ్యమా అని.. ముఖ్యమైన మూడు సేవలకు ఆధార్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందేనని.. లేదంటే ఆ మూడు వినియోగదారుడికి లభించే అవకాశం ఉండదని ప్రభుత్వం తేల్చేసింది. 

మొదటిది ఐటీ రిటర్న్స్.. వినియోగదారుడు తన ఆధార్ నెంబర్ నమోదు చేస్తేనే ఐటీ రిట్‌ర్న్స్‌ను దాఖలు చేసే వీలు ఉంటుంది. రెండోది పాన్ కార్డు.. పాన్ కార్డుకు అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా అధార్ కార్డు ఉండాలి. లేదంటే పాన్ కార్డు ప్రాసెస్ కాదని స్పష్టం చేశారు. ఇక మూడోది పాస్‌పోర్టు జారీ చేయాలంటే.. ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే అని విదేశీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. కాగా, ఈపీఎఫ్ అకౌంట్‌కు కూడా ఆధార్ లింక్ చేసుకోవడమే మంచిది. ఆధార్ నెంబర్ నమోదు అయితేనే డబ్బులు సులువుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.

Also Read: జూలై నెలలో బ్యాంకులకు 8 రోజులు సెలవులు.. వివరాలివే..