ఏపీ కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. భువనేశ్వర్ నుంచి ప్రత్యేకవిమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అనంతరం తిరుచానూర్ పద్మావతీ అమ్మవారిని దర్శించుకుంటారు. తరువాత తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. గన్నవరం తిరుగు పయనం అవుతారు. ఇక రేపు ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ గా బిశ్వభూషణ్ హరి చందన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.