ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు..

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు...

ఏపీ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. పాలిటెక్నిక్‌లో కొత్తగా 5 కోర్సులు..

Updated on: Oct 15, 2020 | 11:09 AM

ఏపీ విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతించింది. వెబ్ డిజైనింగ్, 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్-మల్టీమీడియా టెక్నాలజీ, ప్యాకేజింగ్ టెక్నాలజీ, సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డిప్లొమా కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకొస్తూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. (New courses sanctioned for private polytechnics)

గుంటూరు జిల్లా చెబ్రోలు మండలంలోని సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్, యానిమేషన్- మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్‌లో డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి అనుమతించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం కిమ్స్ కాలేజీలో ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వగా.. కోరంగిలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్‌లో 3-డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సును అనుమతించింది.

అటు రాజానగరంలోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ విమెన్‌లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)లో డిప్లొమా కోర్సును మంజూరు చేసింది. ఈ కోర్సుల్లో ప్రవేశం పొందే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సుల వ్యవధి మూడేళ్గుగా నిర్ణయించారు. కాగా, SBTET నిబంధనల ప్రకారం పాలీసెట్ ద్వారా ప్రవేశాలను నిర్వహించనున్నారు.

Also Read:

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్.. దసరా స్పెషల్ ట్రైన్స్ లిస్ట్ ఇదే.!

ఆ పాత రూపాయి నాణెంతో.. రూ. 25 లక్షలు మీ సొంతమవుతాయట!

బిగ్ బాస్ 4: ‘టాప్’ లేపుతున్న ఆ ఇద్దరు.. ఫైనల్ ఫైవ్‌లో ఎవరుంటారో.?