మృత్యుంజయుడిగా బోరుబావి నుంచి బయటపడ్డ చిన్నారి

| Edited By:

Apr 14, 2019 | 5:00 PM

మథుర: ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఐదేళ్ల ప్రవీణ్ పక్కనే ఉన్న పండ్లతోటలోకి వెళ్లాడు. అక్కడ బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని బాలుడ్ని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. కెమెరాల సాయంతో బాలుడు సేఫ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలపాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు. 

మృత్యుంజయుడిగా బోరుబావి నుంచి బయటపడ్డ చిన్నారి
Follow us on

మథుర: ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల బాలుడ్ని క్షేమంగా బయటకు తీశారు. బాలుడి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఐదేళ్ల ప్రవీణ్ పక్కనే ఉన్న పండ్లతోటలోకి వెళ్లాడు. అక్కడ బోరు బావిలో పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకుని బాలుడ్ని రక్షించేందుకు రంగంలోకి దిగాయి. కెమెరాల సాయంతో బాలుడు సేఫ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఎనిమిది గంటలపాటు శ్రమించి బాలుడ్ని బయటకు తీశారు.