కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.!
దేశ ఆర్థిక రాజధాని ముంబైని హైదరాబాద్తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైళ్లను...
Hyderabad Bullet Train: దేశ ఆర్థిక రాజధాని ముంబైని హైదరాబాద్తో అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో ముంబై-హైదరాబాద్ కూడా ఉంది. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేయాలని జాతీయ హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్)ను కేంద్రం ఆదేశించింది. ఈ ఏడు రైళ్లకు మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ.10 లక్షల కోట్లు ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై-అహ్మదాబాద్ మధ్య (508.17 కిలోమీటర్లు) కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. దాని అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. వాస్తవానికి ఆ మార్గంలో 2023 డిసెంబర్లోనే బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే- భూసేకరణ సంబంధిత సమస్యలు, కోవిడ్ మహమ్మారి విజృంభణ వంటి ఆటంకాల కారణంగా ఆ ప్రారంభ తేదీని 2028 అక్టోబర్కు వాయిదా వేసే సంకేతాలు కనిపిస్తున్నాయి. ముంబై-అహ్మదాబాద్ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు 63 శాతం భూసేకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.
Also Read:
ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!
బిగ్ బాస్ 4: ఈ సీజన్లో ఆమెదే భారీ రెమ్యునరేషన్