జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పురుగుల మందు తల్లీకూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహదేవపూర్ మండలం కన్నెపల్లిలో చోటు చేసుకుంది. తల్లి వేమునూరి సమత(35), కూతురు అశ్విని(13)గా స్థానికులు గుర్తించారు. అయితే వారి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం మహదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.