దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లోనే వైరస్​ వ్యాప్తి అధికం..

|

May 13, 2020 | 9:47 PM

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ మ‌హ‌మ్మారి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ స‌ర్వే చేసింది. బిహార్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, బెంగాల్​, ఒడిశా, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్​ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్​ రోగులను గుర్తించడం చాలా లేట‌వుతుంద‌ని పేర్కొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్​ బారిన‌ పడే అవకాశముందని స‌ర్వే వెల్లడించింది. హ‌ర్యానా, ఉత్తరాఖండ్​, […]

దేశవ్యాప్తంగా ఆ జిల్లాల్లోనే వైరస్​ వ్యాప్తి అధికం..
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా వైరస్​ మ‌హ‌మ్మారి ప్ర‌మాద‌క‌రంగా ఉన్న ప్రాంతాలపై ఓ ప్రజా ఆరోగ్య సంస్థ స‌ర్వే చేసింది. బిహార్​, ఝార్ఖండ్​, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, బెంగాల్​, ఒడిశా, గుజరాత్​, రాజస్థాన్​, మహారాష్ట్రలోని జిల్లాలకు వైరస్​ నుంచి అధిక ముప్పు పొంచి ఉందని తేలింది. ఈ ప్రాంతాల్లో వైరస్​ రోగులను గుర్తించడం చాలా లేట‌వుతుంద‌ని పేర్కొంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడులోని తూర్పు జిల్లాలు..కర్ణాటకలోని ఉత్తర జిల్లాలు, ఓ మోస్తరుగా వైరస్​ బారిన‌ పడే అవకాశముందని స‌ర్వే వెల్లడించింది. హ‌ర్యానా, ఉత్తరాఖండ్​, పంజాబ్​, జమ్ముకశ్మీర్​, కేరళ, హిమాచల్​ప్రదేశ్​, ఈశాన్య రాష్ట్రాల్లోని అధిక జిల్లాల్లో వైరస్​ ప్రమాదం తక్కువగా ఉందని అధ్యయనం చేసిన సంస్థ తెలిపింది. అంతర్జాతీయ స‌ర్వేల‌ ప్రకారం..జనాభా, ఆరోగ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, సహా మొత్తం 15 అంశాలు వైరస్​ సోకే అవకాశాలు పెంచుతాయి. అధ్యయనం అనంతరం ‘వల్నరెబిలిటీ ఇండెక్స్​’ను రూపొందించినట్టు పరిశోధకులు తెలిపారు. ప్రతి జిల్లాలోని వైరస్​ కేసులు, అసలు పరిస్థితులను ఈ ఇండెక్స్​ చూపుతుందని వెల్ల‌డించారు.