అన్నదాతలకు తీపికబురు.. వానలే వానలు

| Edited By:

Jun 18, 2019 | 10:10 AM

ఏపీ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాన జాడ లేక దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. తాజాగా వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా.. కేరళ తీరాన్ని రుతు పవనాలు 15 రోజులపాటు ఆలస్యంగా తాకడంతో ఏపీలో కూడా వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని ఆ […]

అన్నదాతలకు తీపికబురు.. వానలే వానలు
Follow us on

ఏపీ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాన జాడ లేక దాదాపు రెండు నెలలు గడిచిపోయింది. తాజాగా వాతావరణ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఇక నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. జూన్ మొదటి వారంలోనే వర్షాలు కురవాల్సి ఉన్నా.. కేరళ తీరాన్ని రుతు పవనాలు 15 రోజులపాటు ఆలస్యంగా తాకడంతో ఏపీలో కూడా వర్షాలు ఆలస్యంగా కురుస్తున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. జూన్ 18న రాష్ట్రంలోకి రుతు పవనాలు ప్రవేశించిన రెండు మూడు రోజుల్లోనే అవి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల వాయువు ఏర్పడుతోందని.. రానున్న రోజుల్లో ఇది మరింత బలపడుతుందని చెప్పారు. ఈ తరహా వాతావరణం ఏర్పడినప్పుడు ఆకాశంలో మబ్బులు ఏర్పడి.. ఆ తర్వాత క్రమంగా వర్షాలు కురవడం ప్రారంభమవుతుందని వివరించారు. వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ కబురుతో ప్రజలు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.