యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.. ఎప్పుడంటే.?

రాజకీయ నాయకులకు యువత ఓట్లు ఎంతో ముఖ్యమైనవి. అందులో భాగంగానే వారిని ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలన్న వినూత్న నిర్ణయానికి ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ పధకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా […]

యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు.. ఎప్పుడంటే.?

Updated on: Sep 20, 2019 | 7:34 AM

రాజకీయ నాయకులకు యువత ఓట్లు ఎంతో ముఖ్యమైనవి. అందులో భాగంగానే వారిని ఆకర్షించేందుకు పంజాబ్ ప్రభుత్వం సరికొత్త పధకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని యువతకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయాలన్న వినూత్న నిర్ణయానికి ఆ రాష్ట్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ పధకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా డిసెంబర్ నుంచి ఈ కార్యక్రమాన్ని దశల వారీగా చేపట్టనున్నారు.

మొదటిగా ప్రభుత్వ పాఠశాలల్లో 11,12 తరగతులు చదువుతున్న ఫోన్లు లేని విద్యార్థినులకు ఈ స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేయనున్నారు. ఇకపోతే ప్రభుత్వం పంపిణీ చేసే ఫోన్లలో సరికొత్త ఫీచర్లు అందుబాటులో ఉండనున్నాయని అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో సాంకేతికతను మరింతగా విస్తరించడంతో పాటుగా యువతకు ఉద్యోగ, విద్య అవకాశాల గురించి సమాచారం అందిస్తామన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us