రామ్‌కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూటి ప్రశ్న

| Edited By:

Aug 21, 2020 | 4:50 PM

విజయవాడ రమేష్ ఆసుపత్రి గురించి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని సినీ నటుడు రామ్‌ చదివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు

రామ్‌కి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సూటి ప్రశ్న
Follow us on

Vallabhaneni comments on Ram: విజయవాడ రమేష్ ఆసుపత్రి గురించి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని సినీ నటుడు రామ్‌ చదివాడని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. రామ్ సినిమాలు కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా.! వేరే వాళ్లు చూడరా..! వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి అని వంశీ విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించారు.

కులం పేరుతో ఏపీలో రాజకీయాలు చేసేది చంద్రబాబు అని ఆయన అన్నారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారికి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపలేదు కదా..! అని ఆయన ప్రశ్నించారు. బాబు ఒక్కటే తమ సామాజిక వర్గానికి నాయకుడు కాదని, గతంలో చాలా మంది నాయకులు తమ సామాజిక వర్గం కోసం పనిచేశారని అన్నారు. బాబుతోనే తమ సామాజిక వర్గానికి ముప్పు అని వల్లభనేని మండిపడ్డారు. తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా.. ఓటుకు నోటు కేసు వలన అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడని విమర్శించారు. ప్రతిసారి అమరావతి అంటున్న చంద్రబాబు.. తాను మాత్రం హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడని వంశీ దుయ్యారబట్టారు.

Read More:

‘ప్రభాస్ క్యాండీస్‌’.. మరోసారి ప్రేమను చాటుకున్న జపాన్‌వాసులు

జగన్ మరో కీలక నిర్ణయం.. తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు