AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదర్శ మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దాలి..

సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా సేవలుండాలని ఆయన అధికారులకు సూచించారు...

ఆదర్శ మున్సిపాలిటీగా సిరిసిల్లను తీర్చిదిద్దాలి..
Sanjay Kasula
|

Updated on: Sep 02, 2020 | 9:00 PM

Share

సిరిసిల్ల పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని పురపాలక మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చేలా సేవలుండాలని ఆయన అధికారులకు సూచించారు. సిరిసిల్ల అభివృద్ధిపై జిల్లా అధికారులతో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు.

సిరిసిల్ల జిల్ల కరోనా‌ బాధితులకు అందిస్తున్న చికిత్స వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్లస్టర్‌ ఆస్పత్రులపై మరింత దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, బండలింగంపల్లి పీహెచ్‌సీల ఏర్పాటుపై వేగంగా ముందుకెళ్లాలన్నారు. జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలపై మంత్రి ఆరాతీశారు. సిరిసిల్లలో అభివృద్ది పనులను మరింత వేగంగా పరుగులెత్తించాలని అధికారులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు.