Earthquake in Prakasam Dist : అర్థరాత్రి వేళ ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో భూ ప్రకంపనలు, వీధుల్లో జాగారం చేసిన ప్రజలు
నేడు ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. బల్లికురవ ప్రాంతంలో అర్థరాత్రి 1.25 గంటల సమయంలో దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని,..

Earthquake
నేడు ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. బల్లికురవ ప్రాంతంలో అర్థరాత్రి 1.25 గంటల సమయంలో దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించిందని, దీని తీవ్రత స్వల్పంగానే ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.2 గా నమోదైంది. ప్రకంపనలను గమనించి ప్రజలు, వీధుల్లోకి వచ్చి రాత్రంతా జాగారం చేస్తూ గడిపారు. అయితే, ప్రకంపనల కారణంగా ఎటువంటి ఆస్తి నష్టం జరుగలేదు.
Follow Us