Breaking News..మెట్రో రైళ్లకు గ్రీన్‌సిగ్నల్

|

Aug 29, 2020 | 8:30 PM

అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా పట్టాలెక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించారు...

Breaking News..మెట్రో రైళ్లకు గ్రీన్‌సిగ్నల్
Follow us on

అన్‌లాక్‌ 4.0 గైడ్‌లైన్స్‌ను జారీ చేసింది కేంద్రం. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు ఆరు నెలలుగా నిలిచి పోయిన మెట్రో రైళ్లు.. అన్‌లాక్‌ 4.0లో భాగంగా పట్టాలెక్కనున్నాయి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మెట్రో రైళ్ల రాకపోకలకు కూడా అనుమతులు లభించాయి. ఈ క్రమంలో ప్రయాణికుల కోసం నూతన విధివిధానాలను రూపొందించారు మెట్రో అధికారులు. దీని ప్రకారం ఫేస్ మాస్క్ లేకుండా ప్రయాణం చేయడం, రైళ్లు లేదా ప్లాట్‌ఫామ్‌లలో సామాజిక దూరం పాటించకపోవడం, ఉమ్మి వేయడం, చెత్తాచెదారం పడేయడం.. ఖాళీగా ఉండటానికి ఉద్దేశించిన సీట్లపై కూర్చోవడం వంటివి చేస్తే భారీ జరిమానాలు విధించాలని భావిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ ఆంక్షలను పాటించాలని సూచిస్తున్నారు. ఇందు సంబంధించన సైన్ బోర్డులను మెట్రో స్టేషన్లలో ఏర్పాటు చేయనున్నారు.

అంతేకాక సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఒకరు నిత్యం మెట్రో రైలు, స్టేషన్‌లో ఉంటారని.. కోవిడ్‌ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చూడనున్నారు. ఇక నిబంధనలు పాటించని వారిపై ఫైన్‌ల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలు పాటించని వారికి మొదటిసారి 500 వందల రూపాయల జరిమానా విధిస్తారని.. పలుమార్లు నిబంధలు ఉల్లంఘించేవారి విషయంలో ఈ మొత్తం భారీగా పెరగనున్నట్లు సమాచారం.  దీని ద్వారా ప్రతి రోజు హైదరాబాద్‌లో వేల సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణిస్తారు.