IPL 2020 : మూడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మనీశ్​ పాండే

|

Oct 11, 2020 | 9:58 PM

ఐపీఎల్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు.

IPL 2020 : మూడు వేల పరుగులు క్లబ్‌లో చేరిన మనీశ్​ పాండే
Follow us on

ఐపీఎల్‌లో సన్​రైజర్స్​ హైదరాబాద్​ బ్యాట్స్​మన్​ మనీశ్​ పాండే 3వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. దుబాయ్​ వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో హాఫ్ సెంచరీ చేసిన అతడు ఈ ఫీట్ అందుకున్నాడు. టోర్నీలో 3 వేల రన్స్​ మైలురాయిని చేరిన ఆటగాళ్ల లిస్ట్‌లో 16వ క్రికెటర్​గా పాండే నిలిచాడు. ఐపీఎల్​లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్‌గానూ మనీశ్​​ పేరిట రికార్డుంది. 2009 సీజన్​లో ఆర్సీబీ తరుపున ఆడిన పాండే.. 73 బంతుల్లో 114 పరుగులు చేశాడు. గతేడాది ఐపీఎల్​లో ఆడిన 12 మ్యాచ్​ల్లో 43 సగటుతో 344 రన్స్ చేశాడు. ( Bigg Boss Telugu 4 : హౌస్ నుంచి సుజాత్ ఔట్ !..రీజన్స్ ఇవే ! )

ఐపీఎల్​ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ టాప్ ప్లేసులో ఉన్నాడు. ఆ తర్వాత వరుసగా సురేశ్​ రైనా, రోహిత్​ శర్మ ఉండగా.. సన్​రైజర్స్ హైదరాబాద్​ సారథి​ డేవిడ్​ వార్నర్​ నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.