కరోనా కాటుకు న్యాయమూర్తి బలి
మాయదారి కరోనా ధాటికి జనం విలవిలాడుతున్నారు. మందు లేని రోగాలనికి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడి ఓ న్యాయమూర్తి మరణించారు.

మాయదారి కరోనా ధాటికి జనం విలవిలాడుతున్నారు. మందు లేని రోగాలనికి ప్రాణాలను కోల్పోతున్నారు. తాజాగా కరోనా వైరస్ బారిన పడి ఓ న్యాయమూర్తి మరణించారు. గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ నజీర్ ఉల్-ఇన్(42) ఇటీవల కరోనా బారిన పడ్డారు. స్థానికంగా ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కోలుకొని ఇంటికి వద్దామనుకున్న తరుణంలో హఠాత్తుగా ప్లేట్లెట్లు తగ్గి మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే మెరుగైన చికిత్స కోసం శనివారం హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్సపొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయమూర్తి మృతి పట్ల పలువురు జడ్జిలు, న్యాయవాదులు తీవ్ర సంతాపం తెలియజేశారు.




