AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపై గడ్డిగింజలున్నాయ్..

రైల్వే పోలీసులు ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా..ఫైన్‌లు వేస్తున్నా ప్రయాణికులు మాట వినడం లేదు. రైలు పట్టాలపై నుంచే ఫ్లాట్‌ఫాం ఛేంజ్ అవుతున్నారు. అర్భన్ ఏరియాస్‌లో పరిస్థితి కాస్త బానే ఉన్నా..రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి సేమ్ సీన్. ఎన్ని ప్రమాదాలు జరుగుతోన్నా..ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా మార్పు మాత్రం శూన్యం. అలానే రిస్క్ చేసి మరణం అంచులవరకు వెళ్లొచ్చాడో వ్యక్తి. మహారాష్ట్రలోని అసన్‌గావ్ రైల్వే స్టేషన్‌లో తాజా ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో […]

భూమిపై గడ్డిగింజలున్నాయ్..
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2019 | 11:57 PM

Share

రైల్వే పోలీసులు ఎన్ని వార్నింగ్స్ ఇస్తున్నా..ఫైన్‌లు వేస్తున్నా ప్రయాణికులు మాట వినడం లేదు. రైలు పట్టాలపై నుంచే ఫ్లాట్‌ఫాం ఛేంజ్ అవుతున్నారు. అర్భన్ ఏరియాస్‌లో పరిస్థితి కాస్త బానే ఉన్నా..రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి సేమ్ సీన్. ఎన్ని ప్రమాదాలు జరుగుతోన్నా..ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నా మార్పు మాత్రం శూన్యం.

అలానే రిస్క్ చేసి మరణం అంచులవరకు వెళ్లొచ్చాడో వ్యక్తి. మహారాష్ట్రలోని అసన్‌గావ్ రైల్వే స్టేషన్‌లో తాజా ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్టేషన్‌లోకి రైలు వస్తున్న విషయాన్ని గమనించకుండా ఓ వ్యక్తి పట్టాల మీదకు వచ్చాడు. అదే సమయంలో వేగంగా రైలు దూసుకొచ్చింది. ప్లాట్‌ఫాం మీద ఉన్నవారంతా ఒక్క క్షణం ఆందోళనకు గురై.. రైలు వెళ్లిపోయాక పట్టాల మీదకు చూశారు. తీరా అతడు ప్రాణాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రైలు వచ్చే సమయంలో అతడు వెంటనే పట్టాలు, ప్లాట్‌ఫాం మధ్యలో పడుకోని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన తరవాత కూడా అతడితో పాటు మరికొంతమంది పట్టాలు దాటి వెళ్లడం ఈ వీడియోలో కనిపించడం గమనార్హం.