ఈ సంవత్సరంలో తొలి సంపూర్ణ చంద్రగ్రహణం నేటి రాత్రి ఏర్పడనుంది. భారత టైమింగ్స్ ప్రకారం రాత్రి 10.37 తర్వాత దేశవ్యాప్తంగా చంద్రగ్రహణంను వీక్షించవచ్చు. తెల్లవారుజూమున 2.42 గంటలకు గ్రహణం ముగుస్తుంది. దీని ప్రభావం భారత్లో పాక్షికంగా కనిపించనుంది. జనవరిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహనాన్ని ‘వోల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’ అని పిలుస్తారు. దీన్ని శాకాంబరి పూర్ణిమ, ఐస్ మూన్, పౌష్ పూర్ణిమ వంటి నేమ్స్తో కూడా పిలుస్తారు. ఈ గ్రహణాన్ని నేరుగా కంటితోనే చూడవచ్చు. ఈరోజుతో కలిపి ఏడాది మొత్తం మీద నాలుగు సార్లు (జూన్ 5, జూలై 5, నవంబర్ 30 ) చంద్రగ్రహణం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు.