లాక్డౌన్ ఎఫెక్ట్ : మాజీ ఎంపీకి హెయిర్ కట్ చేసిన భార్య..
కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా సెలబ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని […]
కరోనా మహమ్మారి భారత్ లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత అవగాహన కల్పించే దిశగా సెలబ్రిటీలకు ప్రజలకు భిన్న కోణాల్లో సందేశాలిస్తున్నారు. ఇంట్లోనే ఉండి..సామాజిక దూరం పాటించి ప్రాణాలు నిలుపుకోవాలంటూ సూచిస్తున్నారు. తాజాగా ఓ మాజీ ఎంపీ తన భార్యతో హెయిర్ కట్ చేయించుకున్నారు.
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్డౌన్ సమయంలో ప్రజలంతా ఇళ్లల్లోనూ ఉండాలని విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ శంకరరావు పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తప్ప.. బయటకు రావద్దని సూచించిన ఆయన.. ఇంట్లోనే హెయిర్ కట్ చేయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన భార్య స్వర్ణతల హెయిర్ కట్ చేసిన ఫొటోతో లాక్డౌన్ పాటించాలనే.. సందేశాన్ని చాటారు. జనాలు సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదని.. అలా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని శంకరరావు హెచ్చరించారు.