తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం.. భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ

|

Jun 21, 2023 | 9:52 PM

ఈ సంస్థ ప్రారంభించిన తొలి ఆరు నెల‌ల్లోనే 600 మందితో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 2.8 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌తో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవ‌లందిస్తుంది. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే

తెలంగాణకు కొనసాగుతున్న పెట్టుబడుల ప్రవాహం.. భాగ్యనగరానికి మరో అంతర్జాతీయ సంస్థ
Ktr
Follow us on

తెలంగాణకి మరో భారీ పెట్టుబడి రానుంది. యూకే కి చెందిన లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ హైదరాబాద్ లో తన టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చింది. ఈ విష‌యాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. గత నెల యూకెలో మంత్రి కేటీఆర్‌ పర్యాటన సందర్భంగా లాయిడ్స్ గ్రూప్ సంస్థ ప్ర‌తినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. యూకేలో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో గత నెల సమావేశం అయిన అనతికాలంలోనే తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషాన్ని ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్‌. త‌మ టెక్నాలజీ సెంటర్ ను త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ప్రారంభించేందుకు లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ ముందుకు వ‌చ్చిన‌ట్లు కేటీఆర్ తెలిపారు.

ఈ సంస్థ ప్రారంభించిన తొలి ఆరు నెల‌ల్లోనే 600 మందితో లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ సంస్థలో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. 2.8 కోట్ల‌కు పైగా క‌స్ట‌మ‌ర్ల‌తో రిటైల్ అండ్ వాణిజ్య విభాగాల్లో లాయిడ్స్ సంస్థ సేవ‌లందిస్తుంది. ఆర్థిక సేవలు అందించడంలో యూకే లో టాప్ పొజిషన్ లో ఉన్న లాయిడ్స్ బ్యాంకు కి దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. రాష్ట్రంలో వ్యాపార అనుకూలతలు, అత్యంత్య నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉండటంతోనే హైదరాబాద్ లో టెక్నాలజీ సెంటర్ ను ప్రారంభిస్తున్నట్టుగా లాయిడ్స్ బ్యాంక్ స్పష్టం చేసింది. టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన ఉద్యోగుల నియామక ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు లాయిడ్స్ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగంలో గొప్పగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారులకు దీర్ఘకాలం పాటు సుస్థిరమైన సేవలు అందించేందుకు వీలు కలుగుతుందని లాయిడ్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాన్ వాన్ కేమెనడే తెలిపారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..