ఢిల్లీలో ఆదివారం సాయంత్రం చెదురుమదురు వర్షాలు పడ్డాయి. వాతావరణం చల్లబడింది. దీంతో వాయు కాలుష్యానికి కొంత చెక్ పెట్టినట్టయిందని వాతావరణ శాఖ తెలిపింది. పాలం, లోధీ రోడ్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. పెనుగాలి కూడా వీచింది. ఎండలతో తల్లడిల్లుతున్న నగర వాసులు కాస్త సేద దీరారు. అటు పంజాబ్, హ ర్యానా, రాష్ట్రాలలోను, యూపీలో కొన్ని ప్రాంతాలలోను కూడా వర్షాలు పడినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా ఎయిర్ క్వాలిటీ కొంతవరకు మెరుగు పడింది.