ఏర్పాట్లపై లక్ష్మీపార్వతి అసహనం.. ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద హైడ్రామా

| Edited By:

May 28, 2019 | 10:05 AM

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద హైడ్రామా నెలకొంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులర్పించేందుకు వచ్చిన భార్య లక్ష్మీపార్వతి ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క బ్యానర్ కూడా కట్టకపోవడం దురదృష్టమని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను టీటీడీ కార్యకర్తలు పవిత్ర ప్రదేశంగా భావించాలని.. దీనిని అలంకరించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని ఆమె వెల్లడించారు. టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదంటూ అన్న ఆమె.. వచ్చే పదేళ్ల పాటు ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశీస్సులతో జగన్ […]

ఏర్పాట్లపై లక్ష్మీపార్వతి అసహనం.. ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద హైడ్రామా
Follow us on

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ వద్ద హైడ్రామా నెలకొంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులర్పించేందుకు వచ్చిన భార్య లక్ష్మీపార్వతి ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క బ్యానర్ కూడా కట్టకపోవడం దురదృష్టమని ఆమె అన్నారు. ఎన్టీఆర్ ఘాట్‌ను టీటీడీ కార్యకర్తలు పవిత్ర ప్రదేశంగా భావించాలని.. దీనిని అలంకరించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని ఆమె వెల్లడించారు.

టీడీపీకి భవిష్యత్ కనిపించడం లేదంటూ అన్న ఆమె.. వచ్చే పదేళ్ల పాటు ఎన్టీఆర్, వైఎస్సార్ ఆశీస్సులతో జగన్ సీఎంగా ఉండి గతంలో చేసుకున్న తప్పులను సరిదిద్దుతాడని అభిప్రాయపడ్డారు. తాను టీడీపీ వ్యతిరేకిని కాదని, చంద్రబాబుకు మాత్రమే వ్యతిరేకమని ఆమె వెల్లడించారు. అయితే ఆమె మాట్లాడుతుండగా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు.. లక్ష్మీపార్వతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.