
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునేలా లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 2024లోనూ బీజేపీ రావడం ఖాయంగా కనిపిస్తోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తోందని, కాంగ్రెస్ను వీడే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు భవిష్యత్తు లేదని ఆయన స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినా… టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి మాత్రం అలా ఆలోచించలేకపోయాడని ఆరోపించారు. టీఆర్ఎస్ను ఢీకొట్టాలంటే ప్రధాని మోదీలాంటి నేత కావాలని రాజగోపాల్రెడ్డి తెలిపారు.