జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ తెలుగు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీనుంచి ఉపసంహరించుకుని బీజేపీకి ఆపార్టీ మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో త్వరలో జరుగబోతోన్న తిరుపతి ఎంపీ బై పోల్ లో తమకు మద్దతివ్వాలని జనసేన అధినేత హస్తిన బీజేపీ పెద్దలతో మాట తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా బీజేపీ పెద్దలను కలుస్తోన్న పవన్ వెంట జనసేన పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ కూడా ఉన్నారు.