AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసం.. అధిపత్యం మాదేనంటున్న గుప్కార్

జమ్ము కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్‌ కూటమికి ఆధిక్యత సాధించింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూట‌మి మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగిచింది. బీజేపీ పార్టీ సొంతంగా 74 సీట్లలో విజ‌యం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది.

జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసం.. అధిపత్యం మాదేనంటున్న గుప్కార్
Balaraju Goud
|

Updated on: Dec 23, 2020 | 10:43 PM

Share

JK DDC election results: ప్రతిష్టాత్మకమైన జమ్ముకశ్మీర్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని అటు గుప్కార్‌ కూటమి, ఇటు బీజేపీ వాదిస్తోంది. జమ్ము కశ్మీర్‌ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్‌ కూటమికి ఆధిక్యత సాధించింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూట‌మి మొత్తం 13 జిల్లాల్లో ఆధిప‌త్యం కొన‌సాగిచింది. బీజేపీ పార్టీ సొంతంగా 74 సీట్లలో విజ‌యం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది. జ‌మ్మూ ప్రాంతంలో బీజేపీ త‌న హ‌వా కొన‌సాగింంది. కశ్మీర్ స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం వేర్పాటువాదులకు ఇది గుణపాఠమని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ అన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం శుభపరిమాణమని అన్నారు. అటు, ఏడు పార్టీల‌తో కూట‌మిగా ఏర్పడ్డ గుప్కార్‌.. క‌శ్మీర్‌లో త‌న ప్రాబ‌ల్యాన్ని ప్రద‌ర్శించింది.

గ‌త ఏడాది క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన త‌ర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా డీడీసీ ఎన్నిక‌లు నిర్వహించారు. న‌వంబ‌ర్ 28 నుంచి డిసెంబ‌ర్ 19 వ‌ర‌కు ఎనిమిది ద‌శ‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. 20 జిల్లాల్లోని 280 డీడీసీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు పోలింగ్ చేపట్టారు. డీడీసీ ఎన్నిక‌ల్లో అత్యధికంగా బీజేపీకి 74 సీట్లు ద‌క్కాయి. ఇక, ఆ త‌ర్వాత నేష‌న‌ల్ కాన్ఫరెన్స్ 67, ఇండిపెండెంట్ 49, జ‌మ్మూక‌శ్మీర్ పీడీపీ 27, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాల‌ను కైవ‌సం చేసుకున్నాయి. డీడీసీ ఎన్నిక‌ల్లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం అధికంగా ఉన్నట్లు ఎన్నిక‌ల డేటా చెబుతున్నది. క‌శ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూట‌మికి 72 సీట్లు ద‌క్కాయి. అక్కడ బీజేపీ కేవ‌లం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. శ్రీన‌గ‌ర్ జిల్లా ఫ‌లితం మాత్రం ఇంకా డోలాయ‌మానంలో ఉన్నది. ఆ జిల్లాలో ఇండిపెండెంట్ల హ‌వా న‌డుస్తున్నది. ఇక జ‌మ్మూ ప్రావిన్సులో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్నది. జ‌మ్మూ, ఉద‌మ్‌పూర్‌, సాంబా, క‌థువా, రీసాయి, దోడా ప్రాంతాల్లో బీజేపీ 71 సీట్లు కైవ‌సం చేస‌కున్నది. క‌శ్మీర్‌లో బీజేపీ తొలిసారి మూడు సీట్లను గెలుచుకుంది. ఇది మార్పుకు సంకేతం అని ఆ పార్టీ చెబుతుంది. ఎన్‌సీ, పీడీపీల‌పై ఆ పార్టీ గెల‌వ‌డం గ‌మ‌నార్హం.

Follow Us
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
ఎలాంటి చర్మ వ్యాధులకైనా ఇది రాస్తే చాలు...
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!
బస్టాండ్‌లో పడుకున్న పశువుల్ని లేపిన పాపానికి..ప్రాణం బలి!