‘ఏపీ, తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ యాక్టివ్‌గా ఉంది’

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముప్పు భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఏపీ, తెలంగాణతో పాటు 12 రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ యాక్టివ్‌గా ఉంది

Updated on: Sep 17, 2020 | 8:50 AM

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ముప్పు భారతదేశంలో కొనసాగుతోంది. దేశంలోని 12 రాష్ట్రాల్లో ఈ గ్రూప్ యాక్టివ్‌గా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ఉన్నాయన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన యువత ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరుతుండటంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా సంస్థల దృష్టికి వచ్చిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు ఐఎస్ఐఎస్ సోషల్ మీడియాను వినియోగిస్తోందని రాజ్యసభలో తెలిపారు. బీజేపీ ఎంపీ పీ. సహస్రాబుద్దే అడిగిన ప్రశ్నకు కిషన్ రెడ్డి పైవిధంగా లిఖితపూర్వక సమాధానాన్ని ఇచ్చారు. ”వారి ఇంటర్నెట్ కదలికలపై ఎప్పటికప్పుడు భారత ఏజెన్సీలు నిఘా ఉంచాయని.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని” కిషన్ రెడ్డి తెలిపారు.

2014 నుండి సిరియా, ఇరాక్‌ దేశాలపై పట్టు సాధించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ.. బంగ్లాదేశ్, మాలి, సోమాలియా, ఈజిప్ట్ వంటి దేశాలను తమ అడ్డాలుగా మార్చుకుని కార్యకలాపాలను కొనసాగిస్తూ వస్తోంది. అంతేకాకుండా ఐఎస్ఐఎస్.. లష్కర్-ఎ-తైబా, అల్-ఖైదా వంటి ఇతర ఉగ్రవాద సంస్థలతో కూడా సంబంధాలు ఏర్పరుచుకుంది. అటు భారతదేశంలోని యువతను ఉగ్రవాదం వైపు మళ్ళించేందుకు.. తమ భావజాలాన్ని ప్రచారం చేయడానికి వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తూ వస్తోంది.

తాజాగా ఎన్‌ఐఏ చేసిన ఓ దర్యాప్తులో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, రాజస్తాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ చురుగ్గా ఉన్నట్లు వెల్లడైందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో ఐఎస్ఐఎస్ ఉనికికి సంబంధించి ఎన్ఐఏ 17 కేసులు నమోదు చేసిందని.. ఇప్పటికే 122 మంది నిందితులను కూడా అరెస్ట్ చేసిందని ఆయన అన్నారు. (ISIS most active in 12 Indian states)

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!

Loading...
Unable to load recommendations.
Follow Us